News April 12, 2024

చిత్తూరు: ఫస్ట్ ఇయర్‌లో సగం మంది ఫెయిల్

image

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలవగా ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులూ నిరాశపరిచారు. 50 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. 13,224 మంది పరీక్షలు రాయగా 6,566మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 53 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 12,978 మంది పరీక్షలు రాయగా 6,886 మంది పాసయ్యారు.

Similar News

News January 25, 2026

చిత్తూరు: నేటి నుంచి తేలికపాటి వర్షాలు

image

దక్షిణ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేడు(ఆదివారం), సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గిన విషయం తెలిసిందే.

News January 24, 2026

TDPకి కంచుకోట నగరి: CM

image

నగరి TDPకి కంచుకోట అని CM చంద్రబాబు అన్నారు. ‘వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణా జలాలు అందిస్తాం. కోసలను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం. యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. సమర్థవంతమైన MLAగా భాను పని చేస్తున్నాడు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేశాం. నేరస్థులు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూశాం. ఐదేళ్లలో నంబర్ వన్‌గా రాష్ట్రాన్నిఅభివృద్ధి చేస్తాం’ అని నగరిలో CM అన్నారు.

News January 24, 2026

రూ.1,417 కోట్ల చెక్‌ అందజేసిన CM

image

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 12,932 మహిళా సంఘాలకు రూ.1,417 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల మెగా చెక్‌ను సభ్యులకు శనివారం ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.