News June 27, 2024
చిత్తూరు: మండలాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

చిత్తూరు జిల్లా కుప్పం డివిజన్ పరిధిలో కొత్తగా 2 మండలాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని సీఎం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రాళ్లబూదుగూరు, మల్లనూరును మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలు గడవకముందే నూతన మండలాల ఏర్పాటు ప్రక్రియను సీఎం కార్యాలయం ప్రారంభించింది.
Similar News
News October 20, 2025
ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025
ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025
పూతలపట్టులో చోరీ

పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు, వెండి కాళ్లపట్టీలు మూడు జతలు, రూ.50 వేలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.