News July 1, 2024

చిత్తూరు: మామిడి కిలో రూ. 24 చెల్లించాలి

image

జూలై 1 నుంచి 3 వరకు తోతాపూరి మామిడికి కిలో ధర రూ. 24 కు తగ్గించకుండా చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యజమానులకు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం పరిశ్రమల యజమానులు, రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. రైతులు వారి పంటను నేరుగా ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఒకేసారి కోతలు కోయకుండా విడతల వారీగా చేయాలని సూచించారు. 3న సాయంత్రం మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.

Similar News

News September 20, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

News September 19, 2024

తిరుపతి జిల్లాలో 27 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బదిలీ

image

తిరుపతి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారి చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లనో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 19, 2024

చిత్తూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?

image

చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగతా సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్