News September 11, 2024
చిత్తూరు: రూ.2 లక్షలకు లడ్డూ దక్కించుకున్న ఎమ్మెల్యే

చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో బంగారం దుకాణాల వ్యాపారులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ. 2 లక్షలకు పాడి దక్కించుకున్నారు. లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. మాజీ కార్పొరేటర్ వసంత కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
CTR: రేపే LPG బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పాల్గొంటారు.
News October 15, 2025
కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం

కుప్పం (M) నూలుకుంట గ్రామంలో క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. మురుగప్ప ఆచారి ఇంటి గడప ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గేసి అందులో పసుపు కుంకుమతో పాటు నిమ్మకాయలు, కోడిగుడ్డు, తమలపాకులు, అగరవత్తులు పెట్టి పూజలు చేశారు. దీంతో మురుగప్ప కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
News October 15, 2025
చిత్తూరు: పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్, జిల్లా పర్యాటక మండల చైర్మన్ సుమిత్ కుమార్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కైగల్ జలపాతం, పులిగుండు, కంగుంది ప్రాంతాలతో పాటు మొగిలి దేవాలయాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఐరాల బుగ్గ మడుగు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, పర్యాటకశాఖ ఆర్డి రమణ పాల్గొన్నారు.