News April 5, 2024
చిత్తూరు: రేపు షబ్-ఎ-ఖదర్ జరుపుకోండి

రంజాన్ ఉపవాసాల చివరివారం సందర్భంగా శనివారం జిల్లాలోని ముస్లింలు షబ్-ఎ-ఖదర్ పండుగను జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహూరి జునైది ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి ముస్లింలు భక్తి ప్రపత్తులతో సమాజ శ్రేయస్సు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. షబ్-ఎ-ఖదర్ సందర్భంగా ధనికులైన ముస్లింలు పేదలకు కనీసం 2.2కిలోల గోధుమలు లేదా వాటికి సరిపడా ధనం వితరణ చేయాలని సూచించారు.
Similar News
News November 17, 2025
చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.
News November 17, 2025
చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.
News November 17, 2025
పక్కా ప్లాన్తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్ను పక్కా ప్లాన్తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.


