News January 5, 2025

చిత్తూరు: రేపు PGRS రద్దు

image

జిల్లాలో ఈనెల 6 న సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 6,7 వ తేదీలలో సీఎం చంద్రబాబు పర్యటనలో అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News January 20, 2025

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తొలగింపు

image

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న మధుబాలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయ ఛైర్మన్లను నియమించారు. అయితే ఇవి నామినేటెడ్ పోస్టుల కావడంతో కొందరు ప్రభుత్వం మారిన కొనసాగుతున్నారు. దీంతో వారిని తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

News January 19, 2025

చిత్తూరు: కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమం వాయిదా

image

ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్‌ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.  అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.

News January 18, 2025

CTR: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళకు గాయాలు

image

చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.