News May 25, 2024

చిత్తూరు: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

కురబలకోట రైల్వే స్టేషన్ వద్ద సింగన్నగారిపల్లె యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కదిరి రైల్వేహెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా తెలిపారు. కురబలకోట మండలం, సింగన్నగారిపల్లెకు చెందిన కన్నెమడుగు గిరిబాబు(37), 5ఏళ్లుగా టీబీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన గిరిబాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 16, 2025

చిత్తూరులో చికెన్ ధరలు ఇవే 

image

చిత్తూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి రిటైల్ ధర కేజీ రూ.148, లేయర్ రూ.136, స్కిన్ లెస్ రూ.168. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గినట్లు వ్యాపారులు వాపోయారు. గిట్టుబాటు ధర లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 15, 2025

చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశం

image

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ ప్రసాదరావు హాజరయ్యారు. పలు అంశాలపై అధికారులతో వారు చర్చించారు. జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, రవి కుమార్, గోపాల్ నాయక్, వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

News February 15, 2025

చిత్తూరు: ‘ ప్రేమోన్మాది టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి కుమారుడే’

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలమైంది. కాగా నిందితుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. గణేశ్ తండ్రికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.

error: Content is protected !!