News October 18, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి తంబళ్లపల్లె వెళుతున్న ఇద్దరు యువకులు కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని దాదం వట్టిపల్లి వద్ద ముందు వెళుతున్న RTC బస్సును బైకుతో ఢీకొట్టారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయినట్లు ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. మృతులు తంబళ్లపల్లె మండలం చెట్లవారిపల్లెకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి(19), అజయ్ కుమార్ రెడ్డిగా గుర్తించారు. 

Similar News

News November 17, 2025

చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

image

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్‌లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 17, 2025

చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

image

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్‌లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 17, 2025

చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్‌కు మస్త్

image

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్‌కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్‌ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.