News March 3, 2025

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

image

శాంతిపురం (M) మఠం వద్ద శనివారం బైకుపై లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో <<15621064>>మృతుల సంఖ్య మూడుకు<<>> చేరింది. బైరెడ్డిపల్లె (M) మూగనపల్లికి చెందిన తల్లి కొడుకు తులసమ్మ, రవితేజ అక్కడికక్కడే మృతి చెందగా మరో కొడుకు పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో మూగనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 4, 2025

చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి

image

చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రామ్‌నగర్‌ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు విటులను స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 4, 2025

జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు: కుప్పం DSP

image

కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.  

News March 3, 2025

చిత్తూరు: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 609 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.

error: Content is protected !!