News October 6, 2024

చిత్తూరు: వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి

image

చిత్తూరులోని వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధికి చెందిన ఆకాశ్(14) కట్టమంచి చెరువులో దిగి కూరుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అకాశ్‌ను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడిపెట్టించాయి. చెరువులోకి ఒక్కడే దిగినట్లు సమాచారం.

Similar News

News February 23, 2026

నంజంపేట పోస్టుమాస్టర్‌కు మళ్లీ అవార్డ్

image

సోమల(M) నంజంపేట పోస్టుమాస్టర్ చిదానందంను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆదివారం గుంటూరులో జీడీఎస్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్ సేవకులను సన్మానించారు. వారిలో చిదానందం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. కాగా ఈయన గతేడాది కూడా ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు.

News February 23, 2026

చిత్తూరు జిల్లాలో సహకార సంఘం ఉద్యోగుల పోరుబాట

image

జిల్లాలో సహకార సంఘ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి దశల వారిగా భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో 75 PASCలు ఉండగా.. అందులో 350 మంది విధులు నిర్వహిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 16 నుంచి వారు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. వారి సమ్మెతో గ్రామీణ ప్రాంతాలలో రైతులు రుణాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

News February 22, 2026

మండల స్థాయిలోనూ PGRS: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మ. 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. Meekosam.ap.gov.inలోనూ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 1100లో ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు అన్నారు. ఇక నుంచి డివిజన్, మండల స్థాయిలోనూ PGRS నిర్వహిస్తామన్నారు.