News September 17, 2024
చిత్తూరు: సీటుకోసం బ్యాగు వేస్తే బంగారు నెక్లెస్ పాయె..!

సీటుకోసం బస్సు కిటికీ లోంచి బ్యాగు వేస్తే రూ.4 లక్షల నెక్లెస్ కొట్టేసిన ఘటన చిత్తూరు బస్టాండ్లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం.. బెంగళూరుకు చెందిన లక్ష్మి చిత్తూరు బస్టాండ్కు వచ్చింది. బెంగళూరు వెళ్లే బస్సు రావడంతో సీటు కోసం కిటికిలో నుంచి ఓ సీటులోకి తన హ్యాండ్ బ్యాగు వేసింది. ఆ సీటులో వేరేవాళ్లు కూర్చొని ఉండడంతో దిగేసింది. కాసేపటికి బ్యాగు తెరచి చూసేసరికి 64 గ్రాముల బంగారం నెక్లెస్ కనిపించలేదు.
Similar News
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 27, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 27, 2025
చిత్తూరులో పటిష్ఠ బందోబస్తు

గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు 1, 2 టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప మరెవరిని అనుమతించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.


