News June 10, 2024
చిత్తూరు: సెలవులపై వెళ్లిన టీటీడీ ఈవో

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ ప్రభుత్వం వారం రోజులు పాటు సెలవు మంజూరు చేసింది. అయితే రాష్ట్రం దాటి పోరాదని నిబంధన విధించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న ధర్మారెడ్డి సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో వారం రోజులు పాటు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్రం దాటి పోకుండా నిబంధన విధించడం సంచలనంగా మారింది.
Similar News
News March 23, 2025
యువత బెట్టింగ్లకు పాల్పడవద్దు: సీఐ వాసంతి

యువకులు బెట్టింగ్లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు సీఐ శ్రీనివాసంతి శనివారం తెలిపారు. ఐపీఎల్ మోజులో పడి యువకులు బానిసలు కాకూడదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బెట్టింగ్ గురించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని ఆమె కోరారు.
News March 22, 2025
యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందాం: కలెక్టర్

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని సచివాలయంలో నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఎక్కడన్నా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
News March 22, 2025
చిత్తూరు జిల్లాలో 12 మంది ఎస్ఐల బదిలీ

➤ ఎర్రిస్వామి: వీఆర్ TO చిత్తూరు 1టౌన్
➤ వెంకటరమణ: వీఆర్ TO చిత్తూరు 2 టౌన్
➤ప్రసాద్: చిత్తూరు 2 టౌన్ TO బంగారుపాళ్యం
➤సహదేవి: పెద్దపంజాణి TO పీసీఆర్ చిత్తూరు
➤తులసన్న: వీఆర్ TO సీసీఎస్, చిత్తూరు
➤రామచంద్రయ్య: వీఆర్ TO పెనుమూరు
➤విజయ్ నాయక్: వీఆర్ TO నగరి
➤వెంకటనారాయణ: వీఆర్ TO ఎన్ఆర్ పేట
➤బలరామయ్య: విజయపురం TO డీటీసీ చిత్తూరు
➤వెంకటరమణ: వీఆర్ TO పుంగనూరు
➤ధనంజయరెడ్డి: వీఆర్ TO పెద్దపంజాణి