News March 29, 2024

చిత్తూరు: 1 నుంచి టెన్త్ మూల్యాంకనం

image

చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పదో తరగతి మూల్యాంకనం జరుగుతుందని డీఈవో దేవరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్‌ను నియమించామని చెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పీసీఆర్ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Similar News

News February 6, 2026

పుంగనూరు TDP ఇన్‌ఛార్జ్ మార్పుపై కసరత్తు..?

image

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదుర్కోవడంలో TDP ఇన్‌ఛార్జ్ చల్లా బాబు విఫలం అవుతున్నారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. కూటమి అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం YCPదే పవరంటూ తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం వద్ద వాపోయారట. పెద్దిరెడ్డితో చల్లా లోపాయికారి ఒప్పందాలతో క్యాడర్ నష్టపోతుందని, ఇందుకు చెక్ పెట్టాలని ఓవర్గం హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. అధిష్ఠానం సైతం ఇన్‌ఛార్జ్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.

News February 6, 2026

చిత్తూరు: హస్తం పార్టీ మళ్లీ పుంజుకునేనా.?

image

జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ పుంజుకునే అవకాశాలు తక్కువే. కేంద్ర మాజీ మంత్రి చింతా, స్థానిక నేతలు ప్రజల్లో అడపాదడపా తిరుగుతున్నా ఆ ప్రభావం కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తిరుగుతున్నారు. రఘువీరారెడ్డి వంటి నేతలు నాయకులలో నూతనోత్సాహం నింపేలా ప్రయత్నిస్తున్నారు. మరి మళ్లీ హస్తం పార్టీ జెండా ఎగురుతుందా.?

News February 6, 2026

చిత్తూరు: హజ్ యాత్రికులకు రేపు వైద్య పరీక్షలు

image

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు శనివారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖాజీముల్ హుజా జ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడంతో పాటు వ్యాక్సిన్ వేస్తారన్నారు.