News April 11, 2024
చిత్తూరు: 19 లోపు అభ్యంతరాలు తెలపాలి

డీఎస్సీ-2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసిన పీఈటీ అభ్యర్థుల వివరాలు డీఈవో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. జాబితాను పరిశీలించుకుని ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. గడువు తర్వాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించబడవని డీఈవో స్పష్టం చేశారు.
Similar News
News December 28, 2025
చివరి గ్రీవెన్స్ను పబ్లిక్ సద్వినియోగం చేసుకోండి : జిల్లా ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఎంతగానో అనుకూలమైన కార్యక్రమం అన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి పీజీఆర్ఎస్.
News December 28, 2025
చిత్తూరు: DCCB ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఈనెల 27తో ముగియగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2026 జూన్ 26వ తేదీ వరకు రాజశేఖర్ రెడ్డి DCCB నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్గా కొనసాగనున్నారు.
News December 28, 2025
నేడు పనిచేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. వీరితో పాటు హెచ్ఎ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని ఆయన కోరారు.


