News April 11, 2024

చిత్తూరు: 19 లోపు అభ్యంతరాలు తెలపాలి

image

డీఎస్సీ-2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసిన పీఈటీ అభ్యర్థుల వివరాలు డీఈవో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. జాబితాను పరిశీలించుకుని ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. గడువు తర్వాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించబడవని డీఈవో స్పష్టం చేశారు.

Similar News

News April 23, 2025

టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

image

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

image

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

News April 23, 2025

సివిల్స్‌లో మెరిసిన పలమనేరు వాసి

image

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.

error: Content is protected !!