News May 12, 2024
చిత్తూరు: 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 3000 పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పదవి వివరణ చేసిన పోలీసులు, మాజీ సైనికులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.
Similar News
News January 3, 2026
చిత్తూరు: పరీక్ష కేంద్రాలు ఇవే

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డిఆర్ఓ మోహన్ కుమార్ శనివారం తెలిపారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.1. ఆర్వీఎస్ నగర్లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, 2. పలమనేరు మదర్ తెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, 3. చిత్తూరు మురకంబట్టులోని శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 4. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News January 3, 2026
మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల మద్యం తాగేశారు.!

చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 30, 31 తేదీలతో పాటు జనవరి ఒకటిన మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ మూడ్రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన.. 5738 కేసుల బీర్లు, ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) 14,130 కేసులు అమ్ముడయ్యాయి.
News January 3, 2026
చిత్తూరు: KGBVల్లో 25 పోస్టులకు దరఖాస్తులు.!

చిత్తూరు జిల్లాలోని KGBVల్లో 25 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్-4, ANM-6, హెడ్ కుక్-1, ASST కుక్-4 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-2, పార్ట్ టైమ్ టీచర్-3, చౌకిదార్-2, హెడ్ కుక్-1 ASST కుక్-2 ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.


