News May 12, 2024
చిత్తూరు: 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 3000 పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పదవి వివరణ చేసిన పోలీసులు, మాజీ సైనికులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.
Similar News
News April 13, 2026
చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.
News April 12, 2026
తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.
News April 12, 2026
చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


