News April 4, 2025
చిత్తూరు: 32 మంది కార్యదర్శులకు నోటీసులు

ఆస్తి పన్ను వసూళ్లలో పురోగతి చూపించని 32 మంది ఉద్యోగులకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ 10వ స్థానంలో నిలిచింది. పన్ను వసూళ్లలో సచివాలయంలో పనిచేస్తున్న పలువురు కార్యదర్శులు 75 శాతాన్ని చేరుకోలేదంటూ రెవెన్యూ విభాగం అధికారులు కమిషనర్కు నివేదిక అందించారు. దీని ఆధారంగా ఆయన నోటీసులు జారీ చేశారు.
Similar News
News November 27, 2025
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొనాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్క అధికారి రైతుల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
News November 26, 2025
భూపతి మృతిపట్ల CM చంద్రబాబు విచారం

రామకుప్పం(M) వీర్నమలకు చెందిన వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి మృతి పట్ల CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భూపతి విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమని, వార్డు మెంబర్, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమన్నారు. భూపతి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని CM అన్నారు.
News November 26, 2025
చిత్తూరు: టెన్త్ హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.


