News March 30, 2024
చిత్తూరు: 6వ తేదీ వరకు గడువు పొడిగింపు
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు చిత్తూరు డీఈవో దేవరాజు తెలిపారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి 12 వరకు ప్రవేశ పరీక్ష అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 24, 2025
తిరుమలలో పలు సేవలు రద్దు
రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.
News January 24, 2025
చిత్తూరు: కొత్త దంపతులకు ఊహించని పెళ్లి కానుక
స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు బహుమతిగా విలువైన వస్తువులు ఇస్తుంటాం. కానీ చిత్తూరులో ఓ జంటకు అందిన బహుమతికి అందరూ ఆశ్చర్యపోయారు. నగరంలో జరిగిన ఓ పెళ్లికి ట్రాఫిక్ CI నిత్యబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన దంపతులకు బైకు హెల్మెట్ను బహూకరించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అప్పుడే మనతోపాటూ మనల్నే నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటారన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.
News January 24, 2025
తిరుపతిలో అమానుష ఘటన
తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.