News March 24, 2024
చిత్తూరు: 624 గన్స్ స్వాధీనం

చిత్తూరు జిల్లాలో లైసెన్స్ కలిగిన 697 తుపాకులను పలువురు కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో స్థానిక పోలీసు స్టేషన్ల ద్వారా 624 డిపాజిట్ చేయించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. మిగిలిన 73 తుపాకులు బ్యాంకుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తీసుకెళ్లే సెక్యూరిటీ ఏజెన్సీ వారివి కావడంతో మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు.
Similar News
News December 9, 2025
చిత్తూరు పోలీసులకు 46 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 46 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 8, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 7 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
News December 9, 2025
పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.
News December 9, 2025
పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.


