News April 5, 2024

చిత్తూరు: 95 శాతం పెన్షన్లు పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయినట్లు కలెక్టరేట్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగిరి మున్సిపాలిటీ 98 శాతం, చిత్తూరు మున్సిపాలిటీ 98 శాతం, పలమనేరు మున్సిపాలిటీ 97%, పుంగనూరు మున్సిపాలిటీ 97% పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే నగరి 97%, రామకుప్పం 97%, సోమల 97%, అత్యధికంగా పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయింది.

Similar News

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

image

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.