News April 5, 2024

చిత్తూరు: 95 శాతం పెన్షన్లు పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయినట్లు కలెక్టరేట్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగిరి మున్సిపాలిటీ 98 శాతం, చిత్తూరు మున్సిపాలిటీ 98 శాతం, పలమనేరు మున్సిపాలిటీ 97%, పుంగనూరు మున్సిపాలిటీ 97% పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే నగరి 97%, రామకుప్పం 97%, సోమల 97%, అత్యధికంగా పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయింది.

Similar News

News October 13, 2025

చిత్తూరు పోలీసులకు 34 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల నుంచి 34 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వీటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇందులో అత్యధికంగా భూతగాదాలపై 13 ఫిర్యాదులు అందాయి.

News October 13, 2025

చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

image

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.

News October 13, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.