News March 10, 2025
చిత్తూరు DMHO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.
Similar News
News March 24, 2025
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే చర్యలు: SP

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. అధిక మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే డయల్ 112కు గాని, వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
News March 24, 2025
PES స్నాతకోత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ

కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరైయ్యారు. పీఈఎస్ విద్యా సంస్థ అధినేత దొరస్వామి నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో వైద్య విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.
News March 24, 2025
పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.