News April 2, 2025
చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్: CM

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి అభ్యర్థన మేరకు చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే చినగంజాంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేస్తామన్నారు. కొమ్ముమూరి కాలువ ఆధునికీకరణ, మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, మినీ స్టేడియం, మోటుపల్లి నుంచి కారిడార్ నిర్మాణానికి సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు.
Similar News
News December 8, 2025
సంగారెడ్డి: ఒక్క సర్పంచికి కాంగ్రెస్ నుంచి 9 నామినేషన్లు

నాగల్ గిద్ద మండల కేంద్రంలో సర్పంచి పదవికి ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఒక్కొక్కరు ఉండగా, గ్రూపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ నుంచి ఏకంగా 9 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది బరిలో ఎంతమంది ఉంటారో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ గుంపు రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తోంది.
News December 8, 2025
అరుదైన ఘట్టంలో గోదావరోళ్ల సంతకం..!

స్వాతంత్ర్య భారత గతిని మార్చిన రాజ్యాంగ సభ తొలి సమావేశం (1946 డిసెంబర్ 8)లో తూ.గో తేజాలు ప్రకాశించించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ చారిత్రక ఘట్టంలో జిల్లాకు చెందిన దిగ్గజ నేతలు కళా వెంకటరావు, మొసలికంటి తిరుమలరావు పాల్గొని రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆ బృహత్తర క్రతువులో గోదావరి బిడ్డలు భాగస్వాములు కావడం జిల్లా ప్రజలకు ఎప్పటికీ గర్వకారణమే.
News December 8, 2025
చీరాలలో అన్నదమ్ములు అరెస్ట్..!

చీరాలకు చెందిన అన్నదమ్ములు దాసరి గోపి (32), దుర్గ (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాపట్ల SP ఉమామహేశ్వర్ వివరాల మేరకు.. చీపుర్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న వారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. 6 నెలలుగా జిల్లాలో బైక్లను దొంగిలిస్తున్నారు. చీరాల 1టౌన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 4 బైక్లను దొంగలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు రివార్డ్ అందించారు.


