News March 29, 2025
చిన్నకోడూరు: హోంగార్డుల సమస్యలు తెలుసుకున్న అడిషనల్ డీసీపీ

జిల్లాలో ఉన్న హోంగార్డు సిబ్బందితో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అడిగి తెలుసుకున్నారు. హోంగార్డుల సంక్షేమానికి ఎల్లావేళలా కృషి చేస్తామని, యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరం ఒక కుటుంబ సభ్యులమే అని అన్నారు.
Similar News
News November 14, 2025
ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.
News November 14, 2025
రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ప్రముఖ బ్రూక్ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ గెలుపు.. కలిసొచ్చింది ఇవే!

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపునకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో అతి ముఖ్యమైనవి పరిశీలిస్తే..
1.రేసుగుర్రం నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం (కలిసొచ్చిన స్థానికత)
2.స్టార్ క్యాంపెయినర్గా CM ప్రచారం (ప్రజల్లో చైతన్యం)
3.అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం(మైనార్టీలు INCకి మొగ్గు)
4.MIM మిత్రపక్షం
5.గల్లీల్లో మంత్రుల పర్యటన.. బస్తీల్లో అభివృద్ధి మంత్రం
6.పోలింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్


