News March 29, 2025
చిన్నకోడూరు: హోంగార్డుల సమస్యలు తెలుసుకున్న అడిషనల్ డీసీపీ

జిల్లాలో ఉన్న హోంగార్డు సిబ్బందితో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అడిగి తెలుసుకున్నారు. హోంగార్డుల సంక్షేమానికి ఎల్లావేళలా కృషి చేస్తామని, యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరం ఒక కుటుంబ సభ్యులమే అని అన్నారు.
Similar News
News October 24, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్..!

సీపీఐ పార్టీ ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పోలీసులు అప్రమత్తమై ప్రధాన రహదారులు, మార్కెట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాసంఘాలు, యువత, విద్యార్థులు, మహిళా సంఘాలు బంద్ విజయవంతం చేయడానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేయడంతో అధికారులు, అధిక జాగ్రత్తలు తీసుకున్నారు. WGL కమిషనరేట్ అప్రమత్తమైంది.
News October 24, 2025
రావులపాలెం: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 24, 2025
విజయవాడ బస్టాండ్లో నిలువు దోపిడీ..!

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లోని స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సహా ప్రతి వస్తువుపై MRP కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ, RTC అధికారులు లైట్ తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ల్లో ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు.


