News August 2, 2024

చిన్నారికి అండగా నిలిచిన సిరిసిల్ల కలెక్టర్

image

వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆమెకు చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చి కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి తల్లి, తహశీల్దార్ పేరు మీద జాయింట్ ఖాతా ప్రారంభించి రూ.10 లక్షలు జమ చేస్తామన్నారు. క్యాన్సర్‌ను నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలో పరిశీలించి నివేదిక సమర్పించాలని DMHOను ఆదేశించారు.

Similar News

News December 23, 2025

SRR కళాశాలలో బ్యూటీషియన్ కోర్సుకు గడువు పెంపు

image

KNR(D) SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువు ఉన్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు తరగతులు జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయని, ఫీజు రూ. 2,000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కామాద్రి కిరణ్మయిని సంప్రదించాలని సూచించారు.

News December 23, 2025

హుజూరాబాద్ నుంచి శబరిమలకి సూపర్ లగ్జరీ సర్వీస్

image

హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల అయ్యప్ప స్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది మకరజ్యోతి, మండల పూజల సందర్భంగా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం హుజూరాబాద్ నుంచి నేరుగా శబరిమలకి ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసింది. జనవరి 12 సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సర్వీసులు హుజూరాబాద్ డిపో నుంచి బయలుదేరుతాయని మేనేజర్ పేర్కొన్నారు.

News December 23, 2025

REWIND: కరీంనగర్: రాజకీయ రణక్షేత్రం..!

image

ఈ ఏడాది జిల్లాలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు. సంవత్సరం ఆరంభంలో జరిగిన MLC ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచింది. చివరికి మేధావులు బీజేపీకి పట్టం కట్టారు. ఈ నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో సెగ పుట్టించాయి. ఈ ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిలా మారాయి. అధికార పార్టీకి గట్టి పోటీనిస్తూ BRS, BJPలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచింది.