News July 26, 2024

చిన్నారులపై పెరిగిన లైంగిక వేధింపులు: ఎంపీ చామల

image

దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని లోక్‌సభ భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల సంక్షేమంలో 176 దేశాల్లో 113వ స్థానంలో భారత్
నిలవడం శోచనీయమని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించగా, దీనిపై కేంద్రమంత్రి అన్నపూర్ణ
దేవి స్పందిస్తూ మిషన్ వాత్సల్య యోజన ద్వారా దేశంలో చిన్నారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News July 8, 2025

ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

News July 8, 2025

NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

image

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

News July 8, 2025

NLG: రైతులకు యూరియా కష్టాలు ఇంకెన్నాళ్లు!?

image

నల్గొండ జిల్లాలోని రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు.