News January 31, 2025
చిన్న పొరపాటుతో సైబర్ వలలో పడతాం: పోలీసులు

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని సైబర్ మోసాల బారిన పడేలా చేస్తాయని అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మొబైల్ నంబర్స్, అడ్రస్ ఇవ్వొద్దు అన్నారు. గిఫ్ట్స్, లక్కీడిప్ పేరిట వచ్చే కాల్స్కు స్పందించొద్దు అని, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడపడితే అక్కడ ఇస్తే స్పామ్ కాల్స్ పెరుగుతాయని గుర్తుంచుకోండి అని హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్ఏఎస్సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.
News December 10, 2025
NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

నిజామాబాద్లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.


