News September 25, 2024

చిరుత జాడపై మంత్రి దుర్గేష్ ఆరా

image

కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కందులు దుర్గేష్ బుధవారం కడియపులంక నర్సరీ ప్రాంతానికి వెళ్లి చిరుత జాడపై ఫారెస్ట్ అధికారులను ఆరా తీశారు. నర్సరీ ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News November 25, 2025

తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

image

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

News November 25, 2025

తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

image

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

News November 25, 2025

నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

image

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.