News February 9, 2025
చిరుమల్ల వనదేవతల జాతరకు వేళాయే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర తేదీలను ప్రకటించింది. జాతర వివరాలిలా.. ఈనెల 11వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 12న ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, 13న ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారు. 14న శంకుపండుగ, 15న చిరుమల్ల నుంచి ముసలమ్మ గుట్టకు సమ్మక్కను తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.
Similar News
News March 27, 2025
ఖమ్మం: మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి: కలెక్టర్

సాధారణ మాల్స్లా కాకుండా మహిళా మార్ట్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు.
News March 27, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు రూ.లక్ష రుణం: కలెక్టర్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని నిరుపేదలకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వివిధ మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన 850 లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు రుణాలను ఇవ్వాలని అన్నారు.
News March 27, 2025
ఖమ్మం: POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా, ఖమ్మం డీసీసీ చీఫ్గా పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాధాకిషోర్, దీపక్ చౌదరి పోటీ పడుతున్నారు.