News February 9, 2025
చిరుమల్ల వనదేవతల జాతరకు వేళాయే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర తేదీలను ప్రకటించింది. జాతర వివరాలిలా.. ఈనెల 11వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 12న ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, 13న ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారు. 14న శంకుపండుగ, 15న చిరుమల్ల నుంచి ముసలమ్మ గుట్టకు సమ్మక్కను తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.
Similar News
News April 10, 2026
రామాయంపేట: సైకిల్ పై నుంచి కిందపడి రైతు మృతి

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 10, 2026
భద్రాద్రి: తీవ్రంగా ఆయుష్ వైద్యుల కొరత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుర్వేద (ఆయుష్) వైద్యుల కొరత రోగులను వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అతి తక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉండటంతో హోమియోపతి, ఆయుర్వేద సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను నియమించాలని, తద్వారా సామాన్యులకు ప్రత్యామ్నాయ వైద్య సేవలను చేరువ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. # ప్రపంచ హోమియోపతి దినోత్సవం.
News April 10, 2026
నిర్మల్: అంగన్వాడీలకు కొత్త ‘స్మార్ట్’ ఫోన్లు

నిర్మల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల వివరాల నమోదు కోసం ప్రభుత్వం కొత్త స్మార్ట్ ఫోన్లను మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన 3జీ ఫోన్లు మొరాయించడంతో టీచర్లు పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. జిల్లాలోని 19 మండలాల పరిధిలో గల కేంద్రాల కోసం 881 స్మార్ట్ ఫోన్లు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఆన్లైన్ పని మరింత సులభతరం కానుంది.


