News April 9, 2025
చిలకలూరిపేట: విడదల రజిని బెయిల్పై తీర్పు రిజర్వ్

మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్పై వాదనలు మంగళవారం ముగిశాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. అప్పటి అడిగినంత సొమ్ము చెల్లించుకుంటే అంతు చూస్తామని, స్టోన్ క్రషర్ను మూసి వేయిస్తామని, క్వారీ యజమానులను బెదిరించారని, (ఏజీ) శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టి వేయాలని కోరారు.
Similar News
News November 27, 2025
జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
జనగామ: మొదలైన సర్పంచ్ ఎన్నికల సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జనగామ జిల్లాలోని ఆయా పార్టీల వారు ఎన్నికల సమరం మొదలుపెట్టారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియలో పడ్డారు. నిన్నటి నుంచి మొదలైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు రెండు, మూడు రోజుల్లో క్లియర్ అయ్యే వాతావరణం గ్రామాల్లో కనిపిస్తుంది. కాగా, రిజర్వేషన్ తారుమారు అవడంతో పార్టీ నేతలకు అభ్యర్థుల ఎంపిక సవాల్గా మారింది.


