News March 25, 2025

చిలుకూరు స్కూలుకు కలెక్టర్, ఎస్పీ

image

చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ విద్యార్థుల ప్రార్థన సమయంలో సందర్శించారు. ఉగాదికి హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వెళుతూ చిలుకూరులో ఆగారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 21, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా నస్రుల్లాబాద్ 10.9°C, బొమ్మన్ దేవిపల్లి, డోంగ్లి 11, మేనూర్ 11.1, లచ్చపేట 11.2, బీబీపేట 11.3, బీర్కూర్, జుక్కల్ 11.4, గాంధారి 11.7, బిచ్కుంద 11.8, ఎల్పుగొండ 11.9, రామారెడ్డి, పుల్కల్ 12, రామలక్ష్మణపల్లి 12.1, సర్వాపూర్, ఇసాయిపేట 12.2, నాగిరెడ్డిపేట, మాక్దూంపూర్ 12.7, కొల్లూరు 12.9లుగా నమోదయ్యాయి.

News November 21, 2025

SRSP: 947.474 TMCల వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 947.474 TMCల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 879.761 TMCల అవుట్ ఫ్లో కొనసాగిందన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్‌గా 3,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు.

News November 21, 2025

చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

image

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.