News May 30, 2024

చివరిగా వెలువడేది ‘కొత్తపేట’ ఫలితం!

image

ఓట్ల లెక్కింపు రోజున ఉమ్మడి తూ.గో జిల్లాలో చివరి ఫలితం కొత్తపేట నియోజకవర్గం నుంచి వెలువడనుంది. 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. అత్యధిక ఓట్లు నమోదైన కొత్తపేట నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 2,52,383 మంది ఓటర్లకు గాను 2,14,975 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొత్తపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు మొత్తం 26 రౌండ్లు నిర్ణయించారు.

Similar News

News October 8, 2024

అన్నవరం: సత్యనారాయణ స్వామి ప్రసాదంలో విజయ నెయ్యి..!

image

తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఇక నుంచి విజయ నెయ్యిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్ గడువు ముగియడంతో దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఈ నెయ్యినే వినియోగించనున్నట్లు సమాచారం.

News October 8, 2024

తూ.గో: 9న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న నాదెండ్ల

image

తూ.గో.జిల్లా కాపవరం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాధిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొంటారన్నారు.

News October 7, 2024

మంత్రి నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్‌ మోకా

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్‌ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.