News April 16, 2025

చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయాలి: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకు పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News December 13, 2025

మాచర్ల : ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి

image

మాచర్ల పట్టణంలో ఓ వ్యక్తి శుక్రవారం సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు పట్టణంలోని కోడెల శివప్రసాదరావు కాలనీకి చెందిన ఆటో‌డ్రైవర్‌ వెంకట పేరయ్య(35)గా పోలీసులు గుర్తించారు. వేరే ఇంటిలో సూసైడ్‌ చేసుకోవడంతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News December 13, 2025

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలివే..

image

40 ఏళ్లు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు బ్రెస్ట్‌లో వచ్చే మార్పులను గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. రొమ్ములో కొంత భాగం గట్టిపడటం, రొమ్ము చర్మం రంగు మారడం, చను మొన ప్రాంతంలో పుండ్లు, బ్రెస్ట్ నుంచి స్రావాలు రావడం, చంకల కింద గడ్డలు కనిపించడం అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు. కాబట్టి రొమ్ముల్లో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 13, 2025

మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

image

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.