News April 16, 2025

చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయాలి: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకు పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News December 20, 2025

జనవరి నెలాఖరులోగా విశాఖకు TCS!

image

AP: ప్రముఖ IT సంస్థ TCS ఈ జనవరి నెలాఖరులోగా విశాఖలో ఏర్పాటు కానుంది. తొలుత 2 వేల మందితో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆపరేషన్స్ ప్రారంభించిన రోజే శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 చివరి నాటికి శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. TCS క్యాంపస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ ఐటీ పార్కులోని హిల్-3పై ఎకరానికి 99 పైసల చొప్పున 21.6 ఎకరాలను కేటాయించింది.

News December 20, 2025

దైవమే పాటించిన ధర్మం

image

శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోడానికి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. లోక నాయకుడైనప్పటికీ భూలోక నియమాలు పాటించి, పత్రం రాసిచ్చి, కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని మాటిచ్చారు. నేటికీ భక్తుల కానుకల రూపంలో ఆ రుణాన్ని తీరుస్తున్నారు. మనం ఎంత గొప్పవారమైనా సమాజ నియమాలను గౌరవించాలని, తీసుకున్న అప్పును బాధ్యతగా తిరిగి చెల్లించాలని, కష్టకాలంలో సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలని తెలుపుతుంది.

News December 20, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 142 సొసైటీలు

image

తెలంగాణ వ్యాప్తంగా కో ఆపరేటివ్ బ్యాంకులు <<18617893>>సొసైటీల పాలకవర్గాలు రద్దు<<>> కావడంతో గ్రామాల్లో నాయకులు, రైతు ప్రతినిధులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. సర్పంచ్‌గా ఓడిన వారు పోటీ చేయని సీనియర్ నేతలు అప్పుడే రంగంలోకి దిగి లాబీయింగ్ ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ పాలకవర్గం నామినేట్ కానుంది. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 53, మొత్తం 142 సొసైటీలకు కొత్త అధ్యక్షులు రానున్నారు.