News December 6, 2024
చివరి దశలో పేద జీవితాన్ని గడిపిన సావిత్రి
తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ఫోటోలు తీయటంతో వారి పరిచయం పెళ్లిగా మారింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీశ్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 1981 డిసెంబరు 26న 46 సంవత్సరాల వయసులో మరణించింది.
Similar News
News January 14, 2025
రేపు గుంటూరు రానున్న బాబీ, తమన్
గుంటూరు ఐటీసీ హోటల్ నుంచి మైత్రి మూవీస్ వరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న బైక్ ర్యాలీలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొంటారని గుంటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు బెల్లంకొండ సురేశ్ మంగళవారం తెలిపాడు. అనంతరం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను అభిమానులతో బాబీ, తమన్, డిస్టిబూటర్స్ చూడనున్నారని తెలిపారు. ఈ ర్యాలీని బాలయ్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.
News January 14, 2025
చేనేతలపై అభిమానాన్ని చాటుకున్న మంత్రి లోకేశ్
చేనేతలపై అభిమానాన్ని మంత్రి లోకేశ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లిన లోకేశ్, భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చి సర్ఫ్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా మారారు.
News January 14, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు వాసులు విజయం
సంక్రాతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామ పల్లెకారులు విజయం సాధించారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా గోదావరి జిల్లాల్లో పడవల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న రామాపురం మత్స్యకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.