News January 25, 2025

చివ్వెంల: లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్ల పరిశీలన

image

చివ్వెంలలోని దురాజ్పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా శనివారం నిర్వహించిన దిష్టి పూజలో డీఎస్పీ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర జరిగే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. DSP వెంట సూర్యపేట రూరల్ సీఐ జీ.రాజశేఖర్, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ బీ.వీరరాఘవులు తుంగతుర్తి సీఐ, నాగారం సీఐ, ఎస్సై ఉన్నారు.

Similar News

News November 15, 2025

పాపం తేజస్వీ.. సీఎం అవుదామనుకుంటే?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<18289323>>ఫలితాలు<<>> RJD నేత తేజస్వీ యాదవ్‌కు పీడకలను మిగిల్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 75 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని, తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేజస్వీ భావించారు. అంతేకాకుండా ఈసారి సీఎం కుర్చీ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆర్జేడీకి 25 సీట్లు మాత్రమే కట్టబెట్టి ముఖ్యమంత్రి కావాలన్న తేజస్వీ ఆశలను ఆవిరి చేశారు.

News November 15, 2025

ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి: MHBD కలెక్టర్

image

ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని, ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా కేంద్రాలను, వసతి గృహాలను పరిశీలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News November 15, 2025

కామారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో రూ.2.74 లక్షల టోకరా

image

టెలిగ్రామ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. ‘గుబిభో’ అనే యాప్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్‌లు చూపించారు. డబ్బు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. దీంతో బాధితుడు రూ.2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.