News March 3, 2025
చీపురుపల్లిలో యాక్సిడెంట్.. లైన్మెన్ మృతి

పాలవ్యాను ఢీకొని లైన్ మాన్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. పేరిపికి చెందిన కర్ణపు సత్యం(43) చీపురుపల్లి ఆర్ఈసీఎస్లో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అమ్మవారి జాతరలో విధుల్లో భాగంగా ఆంజనేయపురం వైపు వెళ్తుండగా.. చీపురుపల్లి టీడీపీ ఆఫీసు ఎదురుగా పాలవ్యాను ఢీకొట్టింది. తీవ్రగాయాలతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News October 19, 2025
బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.
News October 19, 2025
VZM: నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు

నగరంలోని బాణాసంచా షాపు యజమానులు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. KL పురంలో అధికారికంగా 8 షాపులు ఉండగా, తాత్కాలిక అనుమతులతో మరో 15 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు, నిర్మించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక అధికారులు అటు వైపు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
News October 18, 2025
VZM: ‘బాల, బాలికలకు సమాన అవకాశాలు’

అన్ని రంగాల్లో బాల, బాలికలకు నేడు సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య అధికారిణి జీవనరాణి అన్నారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఘోషాసుపత్రిని శనివారం సందర్శించారు. రెండో సంతానంగా ఆడబిడ్డలు పుట్టిన బాలింతల వద్దకు వెళ్లి లింగ వివక్షతపై అవగాహన కల్పించారు. బాలికలను చక్కగా చదివించాలని, నేడు అన్ని రంగాల్లో మహిళలదే పైచేయి అని తెలిపారు. లింగ వివక్షత చూపిస్తే చర్యలు తప్పవన్నారు.