News March 2, 2025
చీపురుపల్లి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్

చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ZPఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 4, 2025
VZM: 4వేల మంది మహిళలతో మహిళా దినోత్సవం

మార్చి 8న నిర్వహించే మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది మహిళలతో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
News March 3, 2025
హత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలు: SP

బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు తవిటయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన తవిటయ్య అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాకకు నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడడంతో అప్పట్లో కేసు నమోదైందన్నారు.
News March 3, 2025
MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.