News February 21, 2025

చీరాలలో కొత్త తరహా మోసం

image

చీరాలలో గర్భిణిలకు, బిడ్డ తల్లులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2లక్షలు వస్తాయని నమ్మబలికి, లింక్ పంపి మోసాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన జిల్లా పోలీసులను అభినందించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు.

Similar News

News December 3, 2025

అల్లూరి: అత్తను హత్య చేసిన కోడలికి జైలు

image

రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కె. జ్యోతికి బుధవారం రంపచోడవరం మేజిస్ట్రేట్ కోర్టు 7 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. 2024లో నిందితురాలు తన అత్త లక్ష్మిని కర్రతో కొట్టి దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి మృతి చెందింది. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు వివరించారు.

News December 3, 2025

NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

image

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్  నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.

News December 3, 2025

42 రోజులు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం

image

సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 42 రోజుల పాటు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ అశోక్, అధికారులతో కలిసి ఆయన సైబర్ నేరాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.