News April 24, 2024

చీరాల: తల్లి కళ్లెదుటే ఏడాది కూతురు మృతి

image

చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్నేహలత తన తల్లి, కూతరితో కలిసి చిన్నగంజాం నుంచి బాపట్ల వెళ్తుండగా లారీని తప్పించబోయి కింద పడ్డారు. అదే సమయంలో లారీ వారిపై ఎక్కడంతో అన్విత(1), బోడు సుబ్బారావమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందారు. తన కళ్లెదుటే కూతురు, తల్లిని కోల్పోవడంతో స్నేహలత ఆవేదన వర్ణణాతీతంగా మారింది.

Similar News

News October 27, 2025

ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి రెండు రోజులు సెలవులు

image

మొంథా తుఫాను సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ కళాశాలలకు అక్టోబర్ 27, 28వ తారీఖున సెలవుదినంగా ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగు అవగాహన, జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులు కోరారు. సెలవు ప్రకటించిన విషయాన్ని అందరూ గమనించాలని సంబంధిత అధికారులు సూచించారు.

News October 27, 2025

ప్రకాశం జిల్లాలో ‘మొంథా’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ చర్చ సాగుతోంది. ఓ వైపు అధికారులు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఈ తుఫాన్ ప్రభావం సోమవారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో కనిపించే అవకాశం ఉంది. NDRF బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. ఏది ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ కాస్త తక్కువ ఉండేలా చూడు వరుణదేవా అంటూ ప్రజలనోట ఈ మాట వినిపిస్తోంది.

News October 27, 2025

నేటి కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.