News March 5, 2025
చీరాల: ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి

ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన చీరాలలో జరిగింది. యువతి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న పూజేశ్, అదే కళాశాలలోని యువతిని ప్రేమించాలని వేధించేవాడు. అయితే యువతి ప్రేమను నిరాకరించడంతో స్థానిక సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి, దాడి చేశారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువతికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 13, 2025
మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు

మహిళను వేధించిన కేసులో కోర్టు ఒకరికి జైలు శిక్ష విధించినట్లు కొల్లూరు SI అమర వర్ధన్ తెలిపారు. SI వివరాల మేరకు తాడిగిరిపాడుకు చెందిన టి. క్రీస్తురాజు అదే గ్రామానికి చెందిన ఓ మహిళని 2022లో వేధించేవాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. అతనిపై నేరం నిరూపణ అవ్వటంతో తెనాలి ప్రధాన సివిల్ జడ్జ్ పవన్ కుమార్ ఒక నెల జైలు శిక్ష, రూ.1000లు జరిమాన విధించారు.
News November 13, 2025
విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

AP: విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని CMO తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం వైజాగ్కు చేరుకోగా ఆయనకు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.
News November 13, 2025
మహానంది కోనేరు వద్ద భద్రత కరవు?

మహానంది దేవస్థానంలోని కోనేరుల వద్ద భక్తులకు భద్రత కరవైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. గతంలో చోరీల నివారణకు షిఫ్టుల వారీగా 8 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించేవారు. అయితే, ప్రస్తుతం వేతనాల భారం పేరుతో వారి సంఖ్యను ఒక్కరికి తగ్గించడంతో భద్రత ప్రశ్నార్థకమైందని భక్తులు అంటున్నారు.


