News March 5, 2025
చీరాల: ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి

ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన చీరాలలో జరిగింది. యువతి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న పూజేశ్, అదే కళాశాలలోని యువతిని ప్రేమించాలని వేధించేవాడు. అయితే యువతి ప్రేమను నిరాకరించడంతో స్థానిక సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి, దాడి చేశారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువతికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 20, 2025
నిజామాబాద్: NPOs/NGOs దరఖాస్తు చేసుకోవాలి: DYSO

2025-26 సంవత్సరానికి జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం (NPYAD) పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ (ఆర్థిక సహాయం) కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO పవన్ కుమార్ తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన లాభాపేక్షలేని సంస్థలు (NPOs/NGOs) నుంచి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.
News November 20, 2025
రాజన్న ఆలయ ఏఈఓకు ప్రచార రథం బాధ్యతలు అప్పగింత

వేములవాడ రాజన్న ఆలయం సహాయ కార్య నిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్కు స్వామి వారి ప్రచార రథం ఏఈఓగా బాధ్యతలు అప్పగించారు. అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ప్రచార రథం వద్ద దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీనివాస్కు ప్రచార రథం వద్ద అదనపు బాధ్యతలు అప్పగించారు. భీమేశ్వరాలయంతో పాటు మరికొన్ని విభాగాలకు ఆయన ఏఈఓగా కొనసాగుతారు.


