News June 16, 2024

చీరాల: సముద్ర తీరంలో విద్యార్థి గల్లంతు

image

చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కోసూరి కార్తీక్ (19), మైలవరపు కేదారేశ్వరరావు (19) అలల ధాటికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసుల సాయంతో కేదారేశ్వరరావును కాపాడగలిగారు. కార్తీక్ కోసం గాలిస్తున్నారు.

Similar News

News October 3, 2024

ఒంగోలులో సందడి చేయనున్న కీర్తి సురేశ్

image

ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

News October 3, 2024

ఒంగోలు: నేటి నుంచి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

image

ఒంగోలులోని కొండమీద వెలసిన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.

News October 2, 2024

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

image

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో CM చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.