News May 26, 2024

చీరాల: సాయం చేయబోయి మృత్యుఒడిలోకి..

image

చీరాల ఆరబిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంపన పవన్ కుమార్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈపూరుపాలెం నుంచి చీరాలకు పవన్ కుమార్ బైకుపై వస్తుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు లిఫ్ట్ అడిగి తనను రైల్వే స్టేషన్ వద్ద దింపమని కోరాడు. అతడిని ఎక్కించుకొని ఆరబి మీద వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News April 17, 2026

ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

image

ప్రకాశం జిల్లాలో జనగణన-2027లో భాగంగా ‘స్వీయ గణన'(Self-Enumeration) ప్రారంభమైందని కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు se.census.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. లాస్ట్‌లో వచ్చే యూనిక్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుని.. మేలో ప్రజల వద్దకు వచ్చే అధికారులకు వాటిని చూపాలని కోరారు.

News April 17, 2026

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

image

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

News April 17, 2026

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

image

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.