News February 28, 2025
చెంచుల సంక్షేమానికి తోడ్పాటు: నంద్యాల కలెక్టర్

చెంచు గిరిజనులు తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని బైర్లూటి చెంచుగూడెం పరిధిలో నన్నారి మొక్కల సాగుపై వారితో మాట్లాడారు. చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, శ్రీశైలం ఐటీడీఏ పీవో శివప్రసాద్ ఉన్నారు.
Similar News
News October 21, 2025
రీ సర్వేకి రైతులు సహకరించండి: జేసీ

పెదపాడు మండలం పునుకొల్లులో జరుగుతున్న గ్రౌండ్ రీసర్వే పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మంగళవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఏలూరు జిల్లాలో మొదటి, రెండో విడత రీసర్వే విజయవంతంగా పూర్తయిందన్నారు. రీసర్వే తేదీని నోటీసు ద్వారా ముందుగా తెలియజేస్తామని, రైతులందరూ సహకరించాలని కోరారు. అభ్యంతరాలుంటే అధికారులు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.
News October 21, 2025
మనందరి తొలి ఆర్ట్ టీచర్ ఈయనే.. ఏమంటారు?

మనలో చాలా మంది సృజనాత్మకతను తొలిసారి బయటకు తీసింది POGO ఛానల్లో వచ్చిన ‘M.A.D. with Rob’ షోనే. ఇది 90S కిడ్స్కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హోస్ట్ రాబ్ మనందరి తొలి ఆర్ట్ టీచర్. ఆయన వేస్ట్ నుంచి బెస్ట్ క్రాఫ్ట్స్ ఎలా చేయాలో చక్కగా వివరించేవారు. దాన్ని ఫాలో అయి మనమూ రూపొందిస్తే పేరెంట్స్ సంతోషించేవారు. అందుకే ఈ షో చూసేందుకు వారు ప్రోత్సహించేవారు. దీనిని మరోసారి ప్రసారం చేయాలనే డిమాండ్ నెలకొంది.
News October 21, 2025
జూబ్లీహిల్స్లో బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ: రాంచందర్రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP, మజ్లిస్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని TBJP చీఫ్ రామచందర్రావు అన్నారు. BJP అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. వారు పోటీలో ఉన్నట్లు నటించడమే తప్పు. వాస్తవానికి ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. జూబ్లీహిల్స్లో పథకాలు అమలు కావట్లేదు. సమస్యలు పట్టిపీడిస్తున్నాయి’ అన్నారు.