News February 12, 2025
చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368344317_51316327-normal-WIFI.webp)
కొమరాడ మండలంలో దేవుకోన గ్రామానికి చెందిన గిరిజనుడు కేలే నారాయణరావు(40) చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్లు ఎస్సై నీలకంఠం తెలిపారు. మంగళవారం ఉదయం మేకల మేత తీయుట కొరకు ఇంటి వెనుక ఉన్న చెట్టు ఎక్కి ప్రమాద వశాత్తూ పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతిని బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
Similar News
News February 13, 2025
సదుం: జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739419914170_51961294-normal-WIFI.webp)
జాతీయ కబడ్డి సీనియర్ మహిళా విభాగం జట్టుకు సదుం కబడ్డీ క్లబ్ క్రీడాకారులు గుల్జార్, రుక్సానా ఎంపికైనట్టు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి గురువారం తెలిపారు. డిసెంబర్లో ప్రకాశం జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపడంతో వారు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో ఏపీ తరఫున వారు పాల్గొంటారని పేర్కొన్నారు.
News February 13, 2025
సఖినేటిపల్లి: విరుచుకుపడిన అంబోతు.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739415645531_52165958-normal-WIFI.webp)
సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వేప చెట్టు వద్ద బుధవారం రాత్రి దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న మోరిపోడుకు చెందిన గుబ్బల మురళీకృష్ణ (30)పై ఆంబోతు దాడి చేసింది. ఈ దాడిలో మురళీకృష్ణ గొంతుకి ఆంబోతు కొమ్ము గుచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సఖినేటిపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. మురళీకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
News February 13, 2025
NGKL: విద్యుత్ టవర్కు ఉరేసుకున్నాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739419939607_774-normal-WIFI.webp)
మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిమ్మాజిపేట మం. కోడుపర్తికి చెందిన సురేశ్(21) తల్లి పేరుపై ఉన్న భూమిని పదేళ్ల కింద గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి పట్టా చేసుకున్నాడు. తమకు ఇస్తానన్న భూమి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో సురేశ్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ నిన్న ఇంట్లోంచి వెళ్లి పొలం వద్ద విద్యుత్ స్తంభానికి రేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.