News February 25, 2025
చెడు వ్యక్తులతో స్నేహం చేయకండి : ఎస్పీ

చెడు వ్యక్తులతో స్నేహం చేస్తే మనకు కూడా ఆ అలవాట్లు వచ్చే అవకాశం ఉందని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హితవు పలికారు. సోమవారం రాయచోటిలో మాట్లాడుతూ.. మన స్నేహితులు సిగరెట్స్, మద్యంతాగడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇంకా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే, మనం కూడా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందన్నారు. చెడు వ్యక్తులు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. మోసం చేయవచ్చు లేదా మనల్ని నేరాలకు పాల్పడేలా చేయవచ్చన్నారు.
Similar News
News November 21, 2025
అనకాపల్లి: ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలి

ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం మంజూరు కోసం అర్హత కలిగిన లబ్ధిదారులు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్తో దరఖాస్తు సమర్పించాలన్నారు. అర్బన్, రూరల్ హౌసింగ్ స్కీంలలో మూడు కేటగిరీల విభాగాలలో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. స్థలం లేని వారికి స్థలంతో ఇళ్లు కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
News November 21, 2025
నేడు JNTUకి సీఎం రేవంత్ రెడ్డి

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు నేడు ఉ.10 గం.కు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరై లోగోను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా యూనివర్సిటీ నిర్వహిస్తున్న అలుమ్నీ మీటింగ్ కూడా ప్రారంభించి విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News November 21, 2025
వరంగల్: విద్యార్థుల వికాసానికి ‘చెలిమి’

ఉద్యోగుల భావోద్వేగ స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం చెలిమి సోషియో-ఎమోషనల్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 92 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన నోడల్ టీచర్లు హైదరాబాద్లో మూడు విడతలుగా శిక్షణ పొందుతున్నారు. అనంతరం 6వ తరగతి పై విద్యార్థులకు చెలిమి కరికులం అమలు చేయనున్నారు. భావోద్వేగాలు, స్వీయ నియంత్రణ, పాజిటివ్ ఆలోచన ప్రధాన లక్ష్యం.


