News October 21, 2024
చెత్త తరలించే వాహనంలో పైడితల్లి ఉత్సవ ఏనుగు తరలింపు..!

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం లో ప్రధానమైనది ఎల్ల ఏనుగు రథం. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎల్ల ఏనుగు రథాన్ని పూజించారు. అయితే పండగ అయినా తరువాత తెల్ల ఏనుగు రథంలోని ఏనుగు బొమ్మను చెత్తను తరలించే వాహనంలో తీసుకుని వెళ్లడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పైడితల్లి ఉత్సవ ఏనుగును చెత్తను తరలించే వాహనంలో తరలించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 11, 2026
ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని మెడకు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
News January 11, 2026
సంక్రాంతి లోపు రైతులకు ధాన్యం డబ్బులు: మంత్రి కొండపల్లి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేసి, సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను శనివారం ఆదేశించారు. విజయనగరం జిల్లాకు అదనంగా కేటాయించిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సమీప జిల్లాల్లో అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో సమస్యలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
News January 10, 2026
ఉపాధి పనులు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలి: మంత్రి కొండపల్లి

విజయనగరం జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఉపాధి హామీ పనులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. తన కాంప్ కార్యాలయంలో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ అధికారులతో శనివారం సమీక్షించారు. స్మశానాలు లేని గ్రామాలు, SC కాలనీలకు స్మశానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, గోశాలల పనులు వేగవంతం చేసి బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు.


