News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News January 5, 2026

NGKL: నేటి ప్రజావాణి 31 ఫిర్యాదులు

image

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, చట్టపరంగా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

News January 5, 2026

రాష్ట్రంలో 220 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు JAN 8 నుంచి 22వరకు అప్లై చేసుకోవచ్చు. MD/MS/DNB/DM/MCH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేవలం ఏపీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. <>https://dme.ap.nic.in<<>>

News January 5, 2026

NLG: బ్యాలెట్‌ వైపే మొగ్గు!

image

మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వం బ్యాలెట్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.