News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News November 19, 2025

పెరవలి: కూతురిని గర్భిణిని చేసిన తండ్రి..డీఎస్పీ విచారణ

image

పెరవలి మండలంలో కన్న కూతురిపై తండ్రి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన విషయం తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ జి.దేవకుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.

News November 19, 2025

కాణిపాకం అభివృద్ధికి రూ.25 కోట్లు

image

కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు, సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్లను నిర్మించేందుకు రూ.25కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News November 19, 2025

HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

image

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.