News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News October 19, 2025

దీపావళి.. జీవితాల్లో వెలుగులు నింపాలి: భద్రాద్రి కలెక్టర్

image

ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటి కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో సంతోషభరితంగా, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.

News October 19, 2025

24 ఏళ్ల యువతితో 74 ఏళ్ల తాత పెళ్లి.. ₹2 కోట్ల ఎదురుకట్నం!

image

ఇండోనేషియాలో తన కన్నా 50 ఏళ్లు చిన్నదైన యువతి(24)ని పెళ్లాడాడో వృద్ధుడు (74). ఇందుకోసం ₹2 కోట్ల ఎదురుకట్నం చెల్లించాడు. తూర్పు జావాలో ఈ నెల 1న అరికాను టార్మాన్ పెళ్లి చేసుకున్నాడు. తొలుత ₹60 లక్షలు ఇస్తామని, తర్వాత ₹1.8 కోట్లు అందజేశాడు. అతిథులకు ₹6 వేల చొప్పున గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ ఫొటోగ్రాఫర్‌కు డబ్బులివ్వకుండా ‘నవ దంపతులు’ అదృశ్యమయ్యారు. అయితే వారు హనీమూన్‌కు వెళ్లారని ఫ్యామిలీ చెబుతోంది.

News October 19, 2025

జూరాలకు తగ్గిన వరద

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో ఆదివారం సాయంత్రం జూరాలకు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, వివిధ కాలువల ద్వారా మొత్తం 32,362 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.