News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News December 12, 2025

WNP: రెండో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు

image

వనపర్తి జిల్లాలో ఈనెల 14న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత 5 మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5 గ. వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు

News December 12, 2025

ఫోన్ నంబర్ల బోర్డులు పెట్టండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ప్రదేశాల్లో ఆసుపత్రులు, డాక్టర్ల ఫోను నెంబర్ల వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ హైవేల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

News December 12, 2025

నవోదయ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: వనపర్తి ఎస్పీ

image

శనివారం జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు వనపర్తి జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1,340 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉ 11:30 నుంచి మ. 1:30 గ.ల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.