News April 10, 2025

చెన్నూరు: నాణ్యమైన ధాన్యం కొనాలి: అదనపు కలెక్టర్

image

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. చెన్నూరులో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.  కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.

Similar News

News December 16, 2025

విజయవాడ GGHలో అత్యవసరమైతే అవస్థలే..!

image

విజయవాడ కొత్త GGHలో ఉ. 9 నుంచి సా. 4 గంటల వరకు ఓపీలు చూస్తారు. 4 గంటల తర్వాత క్యాజువాలిటీ బ్లాక్ వద్ద అత్యవసర OP నమోదు, పేషెంట్ అడ్మిషన్ కోసం ఒకే కౌంటర్ ఉండడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో చికిత్స అందించకుండా ఓపీ కోసం వేచి చూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News December 16, 2025

పుంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

image

పుంగనూరు మండలంలోని సుగాలి మిట్ట వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆగి ఉన్న లారీని మరో మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారు తమిళనాడుకు చెందిన ప్రదీప్, శివ శంకర్, అశోక్‌గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

News December 16, 2025

MBNR: ఓపెన్ SSC, INTER.. అప్లై చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News”తో తెలిపారు. ఈనెల 17లోగా (అపరాధ రుసుముతో) www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే చివరి అవకాశమన్నారు.