News April 10, 2025

చెన్నూరు: నాణ్యమైన ధాన్యం కొనాలి: అదనపు కలెక్టర్

image

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. చెన్నూరులో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.  కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.

Similar News

News December 23, 2025

కరీంనగర్: ఉచిత శిక్షణ.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

IELTSలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువు JAN 11 వరకు పొడగించామని జిల్లా BC అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్య చదివేందుకు స్కాలర్ షిప్లు పొందటానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

News December 23, 2025

నెల్లూరు: అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేశాడు.. ‘పాపం పసివారు’

image

తల్లికి వందనం ఇప్పించాలంటూ కలెక్టర్ హిమాన్షు శుక్లాకు పొదలకూరు (M) నల్లపాలనేకి చెందిన కీర్తన, మేరీ బ్లెస్సీ గ్రీవెన్స్‌లో తమ గోడు విన్నవించుకున్నారు. తమకు తల్లిదండ్రులు లేరని తల్లి మూడేళ్ల కిందట చనిపోయిందని, ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News December 23, 2025

పల్నాడు: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ.. అందుకే లేపేశారు.!

image

అడిగొప్పలలో సంచలనం సృష్టించిన కొత్త హనుమంతు, కొత్తశ్రీరామ్మూర్తిల హత్యల వెనుక కారణాలను పోలీసులు గుర్తించారు. ఆధిపత్యం కోసమే వీరిని హతమార్చినట్లు విచారణలో తేలింది. నిందితుడు నరేశ్ వద్ద అనుచరులుగా ఉంటూనే, కొంతకాలంగా మృతులు సొంతంగా సెటిల్‌మెంట్లు చేయడం, అమ్మవారి ఆలయ నిర్వహణలో జోక్యం చేసుకోవడం వివాదాలకు దారితీసింది. మహిళల పట్ల దురుసు ప్రవర్తన కూడా తోడవడంలో వీరిని చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.