News April 10, 2025
చెన్నూరు: నాణ్యమైన ధాన్యం కొనాలి: అదనపు కలెక్టర్

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. చెన్నూరులో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.
Similar News
News December 20, 2025
వికారాబాద్: పగలు, ప్రతీకారాలు రగిలించిన పల్లె పోరు!

పచ్చని పల్లెల్లో పగలు, ప్రతీకారాలను పల్లె పోరు రగిలించింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలిసిమెలిసి ఉండే ప్రజలంతా సర్పంచ్ ఎన్నికల్లో వర్గాలుగా ఏర్పడి దాడులు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ప్రస్తుతం ఉప సర్పంచ్ ఎన్నికపై కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పలువురు మండిపడుతున్నారు.
News December 20, 2025
గుడికి వెళ్తే పాదరక్షలు ఎందుకు విప్పాలి?

ఆలయ పవిత్రతను కాపాడటానికి, శుచిని పాటించడానికి పాదరక్షలు బయటే వదిలేయాలి. అలాగే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాకే గుడికి వెళ్లాలి. ఎందుకంటే.. మనం ధరించే బట్టలు, పాదరక్షల ద్వారా ప్రతికూల శక్తులు గుడిలోనికి ప్రవేశించవచ్చు. దూర ప్రయాణం చేసి గుడికి వెళ్లినప్పుడు, కోనేటిలో స్నానం చేసి బట్టలు మార్చుకోవడం వలన బాహ్య అపవిత్రత తొలిగిపోయి, దైవ దర్శనానికి తగిన సానుకూల స్థితి లభిస్తుందని నమ్ముతారు.
News December 20, 2025
ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్న ఉపాసన

రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల తాజాగా ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారామె. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల ఈ పురస్కారాన్ని తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపారు. ఈ గుర్తింపు మరింత ఎక్కువగా పనిచేయడానికి, తమ పరిమితులను అధిగమించడానికి ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.


