News January 30, 2025

చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

Similar News

News November 15, 2025

NGKL: రేపటి నుంచి అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ప్రథమ, తృతీయ, ఐదో సెమిస్టర్ తరగతులు NOV 16వ తేదీ ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఎం.అంజయ్య తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 15, 2025

స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా: రానా

image

TG: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానాను CID సిట్ విచారించింది. తన బ్యాంకు వివరాలను అధికారులకు రానా అందించారు. స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్‌ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిట్‌కు తెలిపినట్లు రానా పేర్కొన్నారు. అన్నీ పరిశీలించాకే బెట్టింగ్ యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు.

News November 15, 2025

GNT: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు

image

రైతులకు ధాన్యం విక్రయాన్ని సులభం చేస్తూ కొత్త వాట్సాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై 7337359375 నంబర్‌కు “Hi” పంపితే వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు అమ్మదలచిన ధాన్య రకం, బస్తాల సంఖ్య, దగ్గర్లోని కేంద్రం, తేదీ-సమయం వివరాలు పంపగానే స్లాట్ ఆటోమేటిక్‌గా బుక్ అవుతుంది. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేసే దిశగా ఈ చర్య ముందడుగుగా రైతులు భావిస్తున్నారు.