News January 30, 2025
చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Similar News
News December 8, 2025
అప్పట్లో చందర్పాల్.. ఇప్పుడు స్మిత్ ఎందుకంటే?

యాషెస్ 2వ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ చేసే సమయంలో కళ్ల కింద నల్లటి స్టిక్కర్లు అంటించుకొని కనిపించారు. వాటిని యాంటీ గ్లేర్ స్ట్రిప్స్ అని అంటారు. కాంతి నేరుగా కళ్ల మీద పడకుండా అవి ఆపుతాయి. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ల నుంచి వచ్చే కాంతిని కట్ చేసి బంతి స్పష్టంగా కనిపించేందుకు సాయపడతాయి. గతంలో వెస్టిండీస్ లెజండరీ బ్యాటర్ చందర్పాల్ కూడా ఇలాంటివి ధరించేవారు. మీకు తెలిస్తే COMMENT చేయండి.
News December 8, 2025
MDK: నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య ఏకగ్రీవ సర్పంచ్

టేక్మాల్ మండలం చల్లపల్లిలో ఎల్లంపల్లి సంగీతను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి గోపాల్ 2018 సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి 11 ఓట్లతో గెలిచాడు. 5 ఏళ్లు గోపాల్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన గ్రామ ప్రజలు అతని భార్య ఎల్లంపల్లి సంగీతను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో నామినేషన్ వేయించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 8, 2025
ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.


